ఏపీలో వాట్సప్తో పౌరసేవలకు నేడు శ్రీకారం

దేశంలోనే తొలిసారిగా.. రాష్ట్ర ప్రభుత్వం పౌరసేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సప్ పరిపాలన (వాట్సప్ గవర్నెన్స్)కు నేడు శ్రీకారం చుట్టనుంది.
తొలి దశలో 161 సేవలు అందుబాటులోకి
అధికారికంగా ప్రారంభించనున్న మంత్రి లోకేశ్
దేశంలోనే తొలిసారిగా వాట్సప్ గవర్నెన్స్కు శ్రీకారం
సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి: దేశంలోనే తొలిసారిగా.. రాష్ట్ర ప్రభుత్వం పౌరసేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సప్ పరిపాలన (వాట్సప్ గవర్నెన్స్)కు నేడు శ్రీకారం చుట్టనుంది. తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలు అందించనుంది. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. మంత్రి నారా లోకేశ్ గురువారం దీన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. తొలి విడతలో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలవుతాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్షించారు. వాట్సప్ ద్వారా ఎలా సేవలు పొందవచ్చో అధికారులు ప్రజంటేషన్ ద్వారా ఆయనకు వివరించారు. సీఎం మాట్లాడుతూ వాట్సప్ సేవలతో ధ్రువపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకనున్నట్లు వెల్లడించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
సైబర్ భద్రతను బలోపేతం చేయాలి: చంద్రబాబు
పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలి.
వాట్సప్ ద్వారా సేవలందించేందుకు గతేడాది అక్టోబరు 22న మెటాతో ఒప్పందం చేసుకుంది.
రాష్ట్రాన్ని డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పాలన, ప్రభుత్వ సేవలను పౌరులకు వేగవంతంగా అందజేయడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది.
అధికారిక వాట్సప్ నంబర్తో..
వాట్సప్ గవర్నెన్స్లో భాగంగా ప్రభుత్వ అధికారిక వాట్సప్ నంబర్ను ప్రకటిస్తారు. ఆ ఎకౌంట్కు వెరిఫైడ్ ట్యాగ్ (టిక్ మార్క్) ఉంటుంది.
ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని పౌరులకు చేరవేయాలంటే ఈ వాట్సప్ ఖాతా ద్వారా సందేశాలు పంపిస్తుంది. ఒకేసారి కోట్ల మందికి ఈ సమాచారం చేరుతుంది. వరదలు, వర్షాలు, విద్యుత్తు సబ్స్టేషన్ల మరమ్మతులు, వైద్యారోగ్య, వ్యవసాయ, అత్యవసర, పర్యాటక, మౌలిక వసతుల అభివృద్ధి సమాచారం వంటివి అందిస్తారు.
ప్రజలు వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే.. ఈ వాట్సప్ నంబర్కు మెసేజ్ చేస్తే వెంటనే ఒక లింక్ వస్తుంది. అందులో పేరు, ఫోన్ నంబర్, చిరునామా తదితరాలు పొందుపరిచి, వారి వినతిని టైప్ చేయాలి. వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నంబరు వస్తుంది. దాని ఆధారంగా తమ వినతి పరిష్కారం ఎంత వరకూ వచ్చింది? ఎవరి వద్ద ఉంది అనేది పౌరులు తెలుసుకోవచ్చు. ఎలాంటి సమస్యనైనా ఇక్కడ విన్నవించొచ్చు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అర్హతలు, ఆయా పథకాల ద్వారా కలిగే లబ్ధి తదితర అంశాలన్నింటి గురించి ఈ వాట్సప్ నంబరుకు మెసేజ్ చేసి, తెలుసుకోవచ్చు.
రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని వాట్సప్లో పంపిస్తారు. మీకు కావాల్సిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని.. టికెట్లు, వసతి సహా అన్నీ బుక్ చేసుకోవచ్చు. దేవాలయాల్లో దర్శనాల స్లాట్లు, వసతి బుక్ చేసుకోవడం, విరాళాలు పంపటం వంటివి చేయొచ్చు.
ధ్రువపత్రాలూ పొందవచ్చు..
ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఆదాయ, నో ఎర్నింగ్.. ఇలా వివిధ శాఖలకు సంబంధించిన అనేక సర్టిఫికెట్లు వాట్సప్ ద్వారా పొందవచ్చు.
ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్)కి చేసిన దరఖాస్తుల స్టేటస్ తెలుసుకోవచ్చు.
విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్నుల వంటివి ఈ అధికారిక వాట్సప్ ద్వారా చెల్లించవచ్చు. ట్రేడ్ లైసెన్సులు వంటివి పొందవచ్చు.
రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డులు, వివిధ సర్టిఫికెట్లు పొందవచ్చు.
ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ రిమైండర్, ట్రాకింగ్ సర్వీసు, సర్వీసు, రిఫండ్, ఫీడ్బ్యాక్ తదితర సేవలు పొందవచ్చు.
Update:
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పౌరసేవలు అందించేందుకు, ప్రజలనుంచి వినతులు స్వీకరించేందుకు,వారికిఅవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సప్ పరిపాలన (వాట్సప్ గవర్నెన్స్)కు శ్రీకారం చుట్టింది.
మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇందులో తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలుఅందిస్తున్నారు.రెండో విడతలో మరిన్ని సేవలనుఅందుబాటులోకి తీసుకురానున్నారు.
తొలి విడతలోదేవాదాయ, ఇంధన, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ,మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలయ్యాయి.
దీనికోసం అధికారిక వాట్సప్ నంబర్ +919552300009 ను కేటాయించారు.
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
Comments